బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన యువకులు

నవతెలంగాణ – తొగుట
బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు యువకులు  కాంగ్రెస్ పార్టీ లో చేరారు. శనివారం మండలంలో ని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ చెందిన యువకులు బీఆర్ఎస్ సోషల్ మీడి యా, యూత్ లీడర్ బెజ్జనబోయిన ప్రవీణ్, నాయ కులు సూతారి ఆంజనేయులు, గంగోళ్ళ ప్రశాంత్, బేగారి శేఖర్, మహ్మద్ సాజిద్ లు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సి, బీసీ లకు విలువ లేదని భావించి కాంగ్రెస్ పార్టీలో బహుజన బిడ్డ నీలం మధు ముదిరాజ్ ఎంపీ టికెట్ ఇవ్వడం హర్షణీ యం అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, మాజీ సర్పంచ్ చెరుకు విజయ్ రెడ్డి, సిలివేరి రాంరెడ్డి, కుంభల శ్రీనువాస్, ఉపాధ్య క్షులు బెజ్జనబొయిన అనిల్, గ్రామ అద్యక్షులు మిద్దె సంతోష్, సీనియర్ నాయకులు రాములు, బాలకృష్ణ తదితరుల పాల్గొన్నారు.
Spread the love