నవతెలంగాణ – హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో భారత్ లో తన వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో విస్తరిస్తోంది. ఇప్పటికే సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించిన జొమాటో ఇప్పుడు గృహ సేవల విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. అర్బన్ కంపెనీ మాదిరిగా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు మొదలైన పొరుగు సేవలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని, అర్బన్ కంపెనీకి పోటీగా హైపర్లోకల్ సర్వీస్ ప్రొవైడర్ను తీసుకోవాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.