అరుణ సూపర్‌ స్పెషలిస్ట్‌ డెంటల్‌ ఆస్పత్రి ప్రారంభం

నవతెలంగాణ-సంతోష్‌నగర్‌
మారుతున్న కాలానుగుణంగా మంచి వైద్యం ఆరోగ్యం వైద్య సిబ్బంది సేవలు అరుణ సూపర్‌ స్పెషలిస్ట్‌ డెంటల్‌ ఆసుపత్రి ఆసుపత్రి ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రైవేటు ఆసుపత్రి వాళ్లు చొరవ చూపినప్పుడే ఆస్పత్రులకు గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ముసరాంబాగ్‌ అంబర్‌ పేట మార్గంలో ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన అరుణ సూపర్‌ స్పెషలిస్ట్‌ డెంటల్‌ హాస్పిటల్‌ ను భాజపా భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సైదాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కొత్త కాపు అరుణ రవీందర్‌ రెడ్డి,ఉప్పుగూడ, రామ్‌ నగర్‌ కార్పొరేటర్లు, మలక్‌ పేట సిఐ శ్రీనివాస్‌, ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ బిజెపి కార్పొరేటర్‌ జంగం శ్వేత మధుకర్‌ రెడ్డి, ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్‌ కార్తీక్‌ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇక్కడైతే మంచి వైద్యులు ఉంటారో అక్కడ ప్రశాంత వాతావరణంలో ప్రజలు వైద్య సేవలకు అభినందిస్తున్నారు. ప్రభుత్వానికి తోడు ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం వారికి అందుబాటులో ఉండే విధంగా వైద్యం కోసం కషి చేయాలన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో బస్తీ దవాఖాన లో ఏర్పాటు వల్ల కాలనీ వాసులకు ఎంతో మేలు జరిగిందన్నారు. మలక్‌ పేట నియోజకవర్గంలో డాక్టర్‌ కార్తీక్‌ రెడ్డి అరుణ డెంటల్‌ సూపర్‌ స్పెషలిస్ట్‌ హాస్పిటల్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు టిఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది పెద్దలు అభిమానులు కార్యకర్తలు సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love