ఇంటింటికీ తెలుగుదేశం

–  సర్వం సన్నద్ధంకండి : రాష్ట్ర అధ్యక్షుడు కాసాని
నవతెలంగాణ – హైదరాబాద్‌
త్వరలో ప్రారంభమయ్యే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి నాయకులను తెలంగాణ తెలుగుదేశం శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన మెటీరియల్‌ కిట్లను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పార్టీ శ్రేణులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. బుధవారం ఎన్టీఆర్‌ భవన్లో పార్లమెంట్‌ నియోజకవర్గ మాజీ అధ్యక్షులతో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత పేద ప్రజానీకానికి తెలుగుదేశం ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్సీలకు రాజకీయ, సామాజిక న్యాయంతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారంలో టీడీపీ భాగస్వామ్యం కల్పించిందన్నారు. దేశంలోనే తొలిసారి వినూత్న పథకాలతో పేద,బడుగు వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ కషి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివద్ధి చేసి ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. సంక్షేమ, అభివద్ధి, సామరస్య పాలన కోసం తెలంగాణలో మరలా టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని జ్ఞానేశ్వర్‌ చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు చేపట్టిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని సక్సెస్‌ చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి గ్రామంలో టీడీపీ జెండాను ఎగురవేసి ప్రతి ఇంటికి వెళ్లి ఆడబిడ్డలకు బొట్టు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు అట్లూరి సుబ్బారావు, రాష్ట్ర టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌ బియ్యని సురేష్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు సుబాష్‌ యాదవ్‌, కష్ణమాచారి, యాదగౌడ్‌, దుర్గా ప్రసాద్‌, గోపాల్‌ రెడ్డి, అశోక్‌ గౌడ్‌, సంజరు, రాష్ట్ర నాయకులు ఆరీఫ్‌, విజి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Spread the love