నేటి నుంచి 317 జీవో టీచర్ల దరఖాస్తుల స్వీకరణ

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
హైకోర్టు ఆదేశాల ప్రకారం 317 జీవో ద్వారా వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఆదివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 14వ తేదీ వరకు వాటి సమర్పణకు అవకాశమున్నది. అయితే ఆ టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ బదిలీలకు ఇప్పటికే 59,909 దరఖాస్తులొచ్చాయి.

Spread the love