రాజకీయాలకు సోనియా గుడ్‌ బై?

–  భారత్‌ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్‌ ముగిసిందని వ్యాఖ్య
– 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపు
మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలకు
వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తున్నది. రాజ్యాంగాన్ని ధిక్కరి స్తున్నది. కాంగ్రెస్‌ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు.అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం కోసం పోరాడుతుంది. – సోనియా గాంధీ.
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం రారుపూర్‌ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్‌ ప్లీనరీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. భారత్‌ జోడో యాత్ర పార్టీకి కీలక మలుపు..అని చెప్పారు. తన పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ భారత్‌ జోడో యాత్రతో ముగిసిందని చెప్పారు. భారత ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని యాత్ర నిరూ పించిందని తెలిపారు. జోడో యాత్ర పార్టీ, ప్రజల మధ్య సంబంధాలను పునరుద్ధరించిదన్నారు. కాంగ్రెస్‌ ప్రజలతో నిలబడి, వారి కోసం పోరాడటానికి సిద్ధంగా ఉందన్న సంగతి చూపించిందన్నారు. జోడో యాత్ర కోసం కష్టపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు ముఖ్యంగా రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత సమయం దేశానికి, కాంగ్రెస్‌కు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పాలన ప్రతీ సంస్థను అణచివేసి, స్వాధీనం చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమానత్వం కోసం కాంగ్రెస్‌..
కొంతమంది ఆర్థికవేత్తలకు అనుకూలంగా ఉండటం ద్వారా ఆర్థిక నాశనానికి కారణం అయ్యారని ఆరోపించారు. తోటి భారతీయులపై విద్వేష మంటలు వ్యాపింపచేస్తున్నారని విమర్శించారు. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తున్నదనీ, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం కోసం పోరాడతామని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన సమయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించే లక్ష్యాన్ని సాధించాలని శ్రీమతి గాంధీ కాంగ్రెస్‌ కార్యకర్తలను కోరారు. చత్తీస్‌గఢ్‌లో రాయపూర్‌ వేదికగా పార్టీ 85వ ప్లీనరీ సెషన్స్‌ జరుగుతున్నాయి. 2024 ఎన్నికల ముందు పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మత వివక్షకు వ్యతిరేకంగా చట్టాన్ని తెస్తాం : కాంగ్రెస్‌
దేశంలో ద్వేషపూరిత నేరాల ముప్పును పరిష్కరించడానికి, చట్టాన్ని ప్రతిపాదిస్తామని కాంగ్రెస్‌ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరుగుతున్నది. కొన్ని షరతులతో కూడిన ప్రతిపాదిత చట్టం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చనుంది కాంగ్రెస్‌. రాజకీయ తీర్మానంలో మొత్తం 56 అంశాలు ఉంటాయని పార్టీ సీనియర్‌ సభ్యుడు ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌ రాజకీయ తీర్మానంలో వస్తు, సేవల సరఫరాలో మతం, కులం, లింగం, భాష ఆధారంగా వివక్షను నిషేధించే లక్ష్యంతో వివక్ష నిరోధక చట్టాన్ని కూడా ప్రతిపాదిస్తామని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పేర్కొన్నారు. రాజకీయ తీర్మానం పొత్తుపై పార్టీ వైఖరి కూడా త్వరలోనే చక్కబడు తుందని, భావసారూప్యత గల పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తులు ఉంటాయని మరో పార్టీ సభ్యుడు తెలిపారు. పాలకవర్గం న్యాయవ్యవస్థపై తీసుకు వస్తున్న ఒత్తిడిని కూడా చర్చిస్తామ న్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నేతత్వంలో 85వ కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశం శుక్రవారం రారుపూర్‌లో ప్రారంభమైంది. కాంగ్రెస్‌ 2024 జాతీయ ఎన్నికల ప్రచారానికి ప్రణాళిక రెడీ చేస్తుంది.

Spread the love