సాధించాలి

పూర్వం త్రిలింగ దేశాన్ని నాగభైరవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే వాడు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కషి చేసేవాడు. సకాలంలో వర్షాలు పడి, పంటలు బాగా పండేవి. అతని పాలనలో ప్రజలు సుఖసంపదలతో తులతూగుతూ ఉండేవారు.
ఒకానొక సమయంలో త్రిలింగ దేశంలో ఒక వింత జబ్బు వచ్చింది. చాలా మంది ప్రజలు చనిపోయారు. అలాగే సైనికులు కూడా చనిపోయారు. అదే అదనుగా త్రిలింగ రాజ్య సంపదలను చూసి ఓర్వలేని పక్కదేశపు రాజు పెద్ద సైన్యంతో త్రిలింగ మీదకి దండెత్తి వచ్చాడు. నాగభైరవుడు పరాజయం పొందాడు. అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు.

తన ప్రజలు పరాయి రాజు పాలనలో బాధలు అనుభవించడం, తన పరాజయం కంటే ఎక్కువగా నాగ భైరవుడిని బాధించింది. పూర్తిగా నిరాశలో మునిగిపోయాడు. ఇక తను బతికి ఉండటం వధా అనుకోసాగాడు.
నాగభైరవుడు ప్రతిరోజూ కొంత సమయం అడవిలో తను ఉన్న గుహ బయటికి వచ్చి పరిసరాలు పరిశీలిస్తూ ఉండేవాడు. ఒకసారి నాగభైరవుడు అలా గుహ బయటకు వచ్చినప్పుడు ఒక పిల్లకోతి ఒక చెట్టు ఎక్కింది. అది ఆ చెట్టు కాయలు తింటూ తింటూ ఆ చెట్టు మీద ఉన్న కాకి గూడును పడగొట్టటం అతని కంటపడింది. ఆహారం కోసం బయటకు వెళ్ళిన కాకి సాయంత్రానికి తను నివసించే చెట్టు వద్దకు తిరిగి వచ్చింది. పడిపోయిన తన గూడును చూసి ఎంతో విచారించింది. రాత్రంతా నిద్రలేకుండా చెట్టు కొమ్మ మీద ఉంది. తెల్లారినాక పడిపోయిన గూటిని చాలా కష్టపడి కట్టుకుంది.

Spread the love