నవతెలంగాణ – హైదరాబాద్
మూగ, మానసిక వైకల్యంతో ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన (యాచకుడు) యువకుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ. 25వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు తీర్పు ఇచ్చినట్లు కందుకూరు పోలీసు ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. షాద్నగర్కు చెందిన దేవర సాయిలు (23) 2016లో కందుకూరు మండల కేంద్రంలో ఉంటూ వివిధ గ్రామాల్లో భిక్షాటన చేశాడు. 2016, ఆగస్టు 10వ తేదీన మండల పరిధిలోని చిప్పలపల్లి గ్రామంలో మూగ, మానసిక వైకల్యంతో ఉన్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ కోర్టు ఫోక్సో చట్టం కింద విచారణ జరిపి.. నిందితుడికి శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.