- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, తాము తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. గతంలో మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు తిన్నారని, సూరత్ నుంచి చవక చీరలు తెచ్చి నేత చీరల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. పదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే పూర్తి చేశారని, అది మూడేళ్లకే కూలిపోయిందని విమర్శించారు.
- Advertisement -



