Wednesday, February 11, 2026
E-PAPER
Homeక్రైమ్కారు సర్వీసింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

కారు సర్వీసింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -

రెండు పాత కార్లు దగ్ధం
రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

మారుతి సుజుకి సర్వీసింగ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి రెండు కార్లు పూర్తిగా దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పర్‌పల్లిలోని మారుతి సుజుకి సర్వీసింగ్‌ సెంటర్‌ వెనక భాగంలో ఉన్న స్క్రాప్‌లో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన వాహనదారులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లో మంటలు సర్వీసింగ్‌ సెంటర్‌ మొత్తం వ్యాపించాయి. పక్కనే ఉన్న అపార్‌మెంట్‌వాసులు భయాం దోళనకు గురై.. కిందికి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్స్‌ సిబ్బంది రెండు గంటలు కష్టపడి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో మంటలు ఆర్పి వేయడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో సర్వీసింగ్‌ సెంటర్‌లోని రెండు పాత కార్లు ఖాళీ బూడి దయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాపార సముదాయంలో అగ్ని ప్రమాదం
మియాపూర్‌లోని జెఎస్‌ఎం వ్యాపార సముదాయంలో మంగళవారం 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మాల్‌లో నారాయణ స్కూల్‌, ప్రముఖ సూపర్‌ మార్కెట్‌, హోటల్‌, క్లిన్‌ సింక్‌ క్లిక్‌ రిసర్చ్‌ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ ల్యాబ్‌కు సంబంధించిన రసాయనాలు సెల్లార్‌ ప్రాంతంలో పెట్టడంతో వాటి నుంచి అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. పొగను గమనించి వెంటనే స్కూల్‌ పిల్లలను బయటికి పంపించారు. ఫెనికల్‌ ల్యాబ్‌కు సంబంధించిన రసాయనల వల్లనే ప్రమాదం జరిగిందా లేదా ఇతర ఏ కారణాలు అనే అంశంపై దర్యాప్తు జరగాల్సి ఉంది. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే వ్యాపార సముదాయంలో స్కూల్‌ నడపడం పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -