నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంతో పాటు వాడియాల, బోయిన్పల్లి , కొత్తూరు, వెలుగోముల ,అయ్యవారిపల్లి, కొత్తపల్లి, బైరంపల్లి ,కంచనపల్లి, వస్పుల, చిల్వేర్, తదితర గ్రామాలలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణం అనంతరం డప్పు, వాయిద్యాలతోటి సీతారాముల విగ్రహాలను ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, సర్పంచులు శంకర్ ముదిరాజ్, చంద్రయ్య గౌడ్, నాగరాజు గౌడు, సువర్ణ, గోపాల్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు ఎంపిటిసి సభ్యులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు రాజేశ్వర్ , బాల్ రెడ్డి, శారద వెంకటయ్య, విజయ గుప్తా, మంగమ్మ శ్రీనివాసులు, చేయూత అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నరేష్, యాదయ్య, అంబాచారి, గిరిధర్ రావు, వెంకట శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



