- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట : మండల..మండల పరిధిలోని చౌడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధులు 2006,2007వ సంవత్సరానికి చెందిన బ్యాచ్ పూర్వ విద్యార్ధులు తమకు చదువులు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆనాటి మధురానుభూతులు గుర్తుకు చేసుకుని తోటి విద్యార్థులు ఉపాధ్యాయులులతో గడిపిన క్షణాలను గుర్తుకు చేసుకున్నారు.ప్రస్తుతం తాము ఏదో ఒక వృత్తి రీత్యా స్థిరపడ్డామని మంచిచెడులను పంచుకుని సోదరభావంతో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు జయప్రకాశ్ . అశోక్ . ఆంజనేయులు పూర్వ విద్యార్థులు ఉమర్. నబి. రఘు. రమేష్. జావీద్ హకిమ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



