- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 1625 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.321 టీఎంసీల నీరు నిల్వ ఉంది అని ఆయన తెలిపారు.
- Advertisement -