- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. కాటారం మండల కేంద్రం వీధుల్లో ట్రాక్టర్ ట్రాలీపైన విగ్రహాలను కొలువుంచి వీధుల గుండా వినాయకుడులను డప్పుచప్పులతో వైభావంగా ఊరేగించారు. ఊరేగింపు లో మహిళా లు పిల్లలు, పెద్దలు డ్యాన్సులు సేశారు. మండలం లోని వివిధ గ్రామాల్లో విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.ఈ సందర్బంగా అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు రంగుల జల్లుకుంటూ టపాకాయలు కాలుస్తూ ఉత్సాహంగా నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నారు.
- Advertisement -