సరికొత్త ముక్కోణ ప్రేమకథ

సరికొత్త ముక్కోణ ప్రేమకథఎస్‌ కే ఎస్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హ్యూమన్‌ వాల్యూస్‌ ఉన్న ఎమోషనల్‌ లవ్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ఐయ్యర్‌ ఎన్‌ నిర్మిస్తున్నారు.
మురళీ అలకపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆంజనేయులు జక్క ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి షాట్‌కు సీీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ ప్రభు క్లాప్‌ ఇవ్వగా, మరో సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ పర్వతనేని రాంబాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ఎన్‌ మాట్లాడుతూ, ‘మా ప్రొడక్షన్‌ నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మా మొదటి సినిమాని సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్నాం. రెండవ చిత్రాన్ని ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. ప్రస్తుతం ఆ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉంది. మూడో సినిమాకు శ్రీకారం చుట్టాం. దర్శకుడు మురళి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. ఫ్రెష్‌ లవ్‌ స్టోరీ. ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాం. మూడు పాత్రల మధ్య సాగే టీనేజ్‌ లవ్‌ స్టోరీ ఇది. ముక్కోణపు ప్రేమ కథ అనే కంటే ప్రేమ, జీవితంలోని భావోద్వేగాలు ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పవచ్చు. ఆ ప్రేమ ఎలా విజయ తీరం చేరిందనేది ఆసక్తికరంగా మా దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. మే రెండో వారంలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించి జూన్‌, జూలైలో చిత్రీకరణ కంప్లీట్‌ చేయాలనుకుంటున్నాం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు.
‘గ్రామీణ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ముగ్గురు పర్సన్స్‌ మధ్యన జరుగుతుంది. ప్రొడ్యూసర్స్‌కు ఈ కథ చెప్పగానే సబ్జెక్ట్‌ కొత్తగా ఉంది అని సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఒక మంచి మూవీతో త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని దర్శకుడు మురళీ అలకపల్లి అన్నారు.

Spread the love