సినిమాగా అల్లా.. హే అల్లా

టోని కిక్‌, సునీత మారస్యార్‌ హీరో, హీరోయిన్లుగా ఎ3 లేబుల్స్‌ బ్యానర్‌పై కొత్త చిత్రం శుక్రవారం ఫిల్మ్‌ నగర్‌ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. బుల్లెట్‌ బండి లక్ష్మణ్‌ దర్శకత్వంలో గిరీష్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత చిన్నికష్ణ క్లాప్‌ కొట్టగా, ఏఐ ప్లెక్స్‌ ప్రదీప్‌ కుమార్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. రైటర్‌ వెలిగొండ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత గిరీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ”నాది కర్ణాటక. రామ్‌, లక్ష్మణ్‌ చేసిన ‘అల్లా హే అల్లా..’ పాట వినగానే నచ్చింది. అందులో సోల్‌ బాగా కనెక్ట్‌ అయ్యింది. ఎంటైర్‌ టీమ్‌ను కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు ఎంతో నచ్చి సినిమా చేయాలనుకున్నాను. ఏ 3 లేబుల్స్‌ బ్యానర్‌ పై తొలి సినిమా చేస్తున్నాను’ అని తెలిపారు. హీరో టోని కిక్‌, హీరోయిన్‌ సునీత మారస్యార్‌ మాట్లాడుతూ, ‘మా డైరెక్టర్‌ బుల్లెట్‌ బండి లక్ష్మణ్‌కి ధన్యవాదాలు. ఆయన చేసిన ‘అల్లా హే అల్లా..’ కాన్సెప్ట్‌తోనే ఇప్పుడు సినిమాను స్టార్ట్‌ చేశాం. మంచి కథ కుదిరింది. మమ్మల్ని నమ్మి ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని అన్నారు. డైరెక్టర్‌ బుల్లెట్‌ బండి లక్ష్మణ్‌ మాట్లాడుతూ, ‘సినీ ఇండిస్టీలోకి ఎప్పుడో వచ్చి ఇబ్బందులు పడి వెనక్కి వెళ్లిపోయాం. అయితే జానపద పాటలు ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందాం. నాలోని సినిమా కలను గుర్తించిన మా నిర్మాత గిరీష్‌ కుమార్‌ సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. ఆయన రుణ తీర్చుకోలేనిది. ఇది వరకు నాలుగు నిమిషాల్లోని పాటలో ఓ కథను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మా నిర్మాత రెండు గంటల సినిమా చేయమని అడిగారు. మా ప్రతీ పాట, మాట థియేటర్స్‌కి ఆడియెన్స్‌ను రప్పించేలా, వారి మనసు మెప్పించేలా ఉంటాయి. నన్ను యూ ట్యూబ్‌లో ఆదరించినట్లే సినిమాలోనూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Spread the love