ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కోడిచెర గ్రామానికి తరలివచ్చిన జన సమూహం

– ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్ వెంటే నాయకులు కార్యకర్తలు
నవతెలంగాణ- మద్నూర్
ఆగస్టు 14న సోమవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే జన్మదిన వేడుకలు మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామంలో మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు ఉమ్మడి మద్నూర్ మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలంలోని నాయకులు కార్యకర్తలు సంగమేశ్వర వెంటే అన్న చందంగా ప్రజాప్రతినిధులు ఎంపీపీ జడ్పిటిసి ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు వందల సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. తన పిలుపుకు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడం కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. సంగమేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జన సమూహం మధ్య ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినానికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Spread the love