రైతులకు రుణమాఫీ చేయని, ప్రభుత్వం రైతుల కోసం మాట్లాడే హక్కు లేదు

– జిల్లా రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి
 నవతెలంగాణ- రామారెడ్డి
రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి రైతుల కోసం మాట్లాడే హక్కు లేదని గురువారం జిల్లా రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దళిత బంద్, బీసీ బంద్, అని సంక్షేమ పథకాలను ప్రజలకు పంచుతున్నామని గొప్పలు చెప్పి, రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను బందు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Spread the love