నవతెలంగాణ – ఆలేరు టౌన్ : ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారిగా పనిచేస్తున్న సుంకరనేని శ్రీనాథ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాగా, శ్రీనాద్ కుటుంబ సభ్యులను, యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ ఆదివారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి బిజెపి పార్టీ తరుపున వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య , జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏలగల వెంకటేష్, మండల కార్యదర్శి బైరి మహేందర్ గౌడ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సుంకరనేని శ్రీనాథ్ కి ఘన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



