గన్​ మిస్​ఫైర్ జవాన్​ మృతి..

నవతెలంగాణ – ఛత్తీస్​గఢ్: నారాయణ్​పూర్​-దంతెవాడ జిల్లాల సరిహద్దులో బుధవారం రాత్రి గన్​ మిస్​ఫైర్ ​అవడంతో డీఆర్​జీ జవాన్​ చనిపోగా, మరో జవాన్ ​తీవ్రంగా గాయపడ్డాడు. దంతెవాడ జిల్లా బార్సూర్​ పీఎస్​పరిధిలోని హాంద్​వాడా, హితావాడా అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా కూంబింగ్ ​నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ జవాన్ ​చేతిలో ఉన్న తుపాకీ మిస్​ఫైర్​ కావడంతో జోగ్​రాజ్​ కర్మా, పరశురాం అలామీలకు తూటాలు తగిలాయి. వీరిద్దరినీ చికిత్స కోసం తరలిస్తుండగా జోగ్​రాజ్​కర్మా మార్గమధ్యలో మృతి చెందారు. పరశురాం అలామీని హెలీకాప్టర్​ ద్వారా రాయ్​పూర్​కు తరలించి వైద్యం అందిస్తున్నారు.

Spread the love