ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

నవతెలంగాణ – కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెజ్జూరు మండలం పోతపెల్లి – కొరతగూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అరకగూడ చెందిన ఆత్రం మహేష్, తుర్రం వెంగయ్య, ఎలుకపల్లి చెందిన దున్న నరసింహులు స్పాట్ లోనే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పెళ్లి రిసెప్షన్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Spread the love