జ‌వాన్ల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు..జ‌వాన్ మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. జ‌వాన్ల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జ‌వాను ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ జిల్లా బార్సూర్ ప‌రిధిలోని హంద‌వాడ‌, హిత‌వాడ‌లో మావోయిస్టులు ఉన్నార‌నే స‌మాచారంతో డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్‌డ్ గార్డ్(డీఆర్‌జీ) పోలీసులు కూంబింగ్ నిర్వ‌హించారు. పోలీసుల క‌ద‌లిక‌ల‌ను ప‌సిగ‌ట్టిన మావోయిస్టులు.. ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో దంతెవాడ డీఆర్‌జీ కానిస్టేబుల్ జోగ‌రాజ్ క‌ర్మ మృతి చెందాడు. మ‌రో కానిస్టేబుల్ ప‌ర‌శురామ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. కానిస్టేబుల్ ప‌ర‌శురామ్‌ను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు త‌ర‌లించారు. ఎదురుకాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో బ‌ల‌గాల కూంబింగ్ కొన‌సాగుతోంది.

Spread the love