తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన దర్శకులు, నిర్మాతలు తీస్తోన్న చిత్రాలు విజయాన్ని సాధిస్తున్నాయి. కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ట్ మేకర్స్ సమర్పణలో మద్దుల మదన్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సౌజన్య కావూరి నిర్మిస్తున్న ఈ మొదటి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెం.1కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల మణికొండలోని శివాలయంలో జరిగాయి.
ఈ కార్యక్రమానికి రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్, విరాజ్ అశ్విన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ ఈవెంట్లో పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘సినీ రంగంలోకి వస్తోన్న కొత్త తరంలో కూడా ఎందరో ప్రతిభా సామర్ధ్యాలతో అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారు. ఏ విత్తనంలో ఎంతటి అద్భుత మహా వక్షం దాగుందో తెలియకుండా విశ్లేషించకూడదు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధించి, యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో రవితేజ మహాదాస్యంపై ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
‘ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. ఓ మంచి కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటివరకు ఇలాంటి అంశంతో సినిమా రాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలం’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్ : నితిన్ రెడ్డి చిమ్ముల, ఎడిటింగ్ : అఖిల్ దేశ్పాండే, సంభాషణలు, పాటలు : జక్క రాజశేఖర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ : మక్కెన విజరు.