- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం సుల్తాన్ పేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ ఏఈ ఎండి మహమూద్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొని, రాబోయే వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, ఉప బాలరాజ్ , పంచాయితీ పాలక వర్గ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



