మారుమూల గ్రామం నుంచి ప్రతిభను చాటిన ఆని ముత్యాలు

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం మారుమూల గ్రామమైన బాగేపల్లి గ్రామానికి చెందిన తేనే అక్షర (467/470), పాముల సాయి చరణ్ (466/470) మార్కులతో ఉత్తీర్ణత సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎస్ ఆర్ కాలేజీలో చదివిన వేరు ఉత్తమ ర్యాంకులను సాధించి గ్రామానికి ఆదర్శవంతంగా నిలిపారని వారు తెలిపారు. సరైన బస్సు సౌకర్యం లేకపోయినప్పటికీ విద్యార్థులు కాలినడకన కూనేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. పదవ తరగతిలో లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో చదివి ఇంటర్ ఎస్ఆర్ కాలేజీలో చేరారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆటో రిక్షాను నడిపిస్తూ తన ముగ్గురు కూతుర్లను చదివించిన తండ్రి అనిల్ ను గ్రామస్తులు అభినందించారు. తమ కూతురు స్టేట్ ర్యాంకును సాధించడం అభినందనీయమని తండ్రి తెలిపారు.
Spread the love