రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ ఎన్నిక

– శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రోజు అసెంబ్లీ లో జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్టిఫికెట్ అందజేశారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సర్టిఫికెట్ అందుకున్న సమయంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  వారితో ఉన్నారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  మాట్లాడారు.  రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల కురుమలు 99శాతం ఓటు వేసి గెలిపించారన్నారు.రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గొల్ల కురుమలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ,జాతీయ అధ్యక్షుడు ఖర్గే కి,భావి ప్రధాని రాహుల్ గాంధీ కి,  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,గొల్ల కురుమలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీ కి రుణపడి ఉంటారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ తోనే గొల్ల కురుమలు అభివృద్ధి జరుగుతుందని గొల్ల కురుమలకు పెద్ద పీట వేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాననికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Spread the love