పోతంగల్ లో వైభవంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన

నవతెలంగాణ – నవీపేట్: మండలంలోని పోతంగల్ లో శివ పంచాయతనామ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా హాజరై హంపి పీఠాధిపతి శ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారిచే నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. మంగళహారతులతో మహిళలు విద్యారణ్య భారతి స్వామిని స్వాగతం పలికి గురువారం జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందస్తు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ నాయకులతోపాటు స్థానిక ఎంపీపీ సంగెం శ్రీనివాస్, సర్పంచ్ రవీందర్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ సౌదా శ్రీనివాస్, ఎంపీటీసీ రాజు, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు..

Spread the love