జిల్లా ప్రజలకు ప్రముఖుల బక్రీద్ శుభాకాంక్షలు

నవతెలంగాణ – కంటేశ్వర్
బక్రీద్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు గురువారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.

Spread the love