ఇన్స్పెక్టర్ గోపగాని గురువయ్యగౌడ్
నవతెలంగాణ-షాబాద్
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ గోపగాన గురువయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని కుర్వగూడలో జాగృతి పోలీస్ కళా బృందంతో అవగాహనా కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా బస్టాండ్, రోడ్డుపైన వెళ్లుతుంటే మహిళలపై ఎవరైన ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే మీదగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల న్నారు. అదేవిధంగా బాల్యవిహాహలు, సైబర్ క్రైం, ఆన్లైన్ మోసాలు, విద్యార్థినీలకు, మహిళల భద్రతపై వారికి క్లుప్తం గా వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుయ్యని సంధ్యారాణి మల్లికార్జున్ గౌడ్, గ్రామస్తులు ఉన్నారు.