కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ

నవతెలంగాణ -రాజంపేట్
మండలంలోని పొందుర్తి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం పెద్దమ్మ గుడి ఆవరణలో కళ్యాణమండపం నిర్మాణానికి గాను బిజెపి కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి భూమి పూజా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజుల అభ్యున్నతికి తోడ్పడడానికి గ్రామంలో ముదిరాజ్ లకు ఒక కళ్యాణ మండపం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలోముదిరాజ్ సంఘ సభ్యులు, మండల అధ్యక్షులు దేవి రెడ్డి గంగారెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సంధ్య, ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షులు సంపత్ రెడ్డి,ఎస్సీ మోర్చా జనరల్ సెక్రెటరీ కంకణాల సిద్ధ రాములు, కుందుర్తి గ్రామ అధ్యక్షులు కుమ్మరి రమేష్, సాయి రెడ్డి, రాము దుర్గాప్రసాద్, సాకలి సంతోష్, మండల ఐటీ సెల్ కన్వీనర్ జంగం మనోహర్ వివిధ గ్రామాల కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు.

Spread the love