అభంగపట్నంలో బిఆర్ఎస్ బూత్ సమావేశం

నవతెలంగాణ- నవీపేట్: అభంగపట్నం గ్రామంలో బిఆర్ఎస్ బూత్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంగెం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ లెవెల్ సమావేశాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా అభంగపట్నం గ్రామంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంకై చేయాల్సిన కృషికై చర్చించారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎస్ చైర్మన్ అబ్బన్న డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, సాయిబాబా, సతీష్, పులి సాయిలు, రాము, సయ్యద్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
Spread the love