రేపు భారత్ కు బైడన్..

నవతెలంగాణ – ఢిల్లీ: భార‌త్ వేదిక‌గా ఢిల్లీలో ఈనెల 9,10వ తేదీల్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు దేశవిదేశాల నుంచి అధ్యక్షులు, కీలక నేతలు రానున్నారు. ఇందులో భాగంగానే జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రానున్నారు. శుక్రవారం రోజునే ఇండియాకు వస్తున్నారు. రేపు రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. బైడెన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి అమెరికా అధ్య‌క్షుడు ది బీస్ట్ కారులో ప్ర‌యాణించ‌నున్నారు. ఈ కారు బోయింగ్ సీ-17 విమానంలో యూఎస్ నుంచి ఢిల్లీకి చేరుకోనుంది.

Spread the love