కాంగ్రెస్‌లోకి చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు

– సొంతగూటికి చేరుకున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మేకగూడెం భిక్షపతి
నవతెలంగాణ-మొయినబాద్‌
చేవెళ్ల గడ్డ పైన రంజిత్‌ రెడ్డి గెలుపు ఖాయమని, కాంగ్రెస్‌ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మేకగూడెం బిక్షపతి అన్నారు. మంగళవారం రాత్రి సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఆయనతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మేకగూడెం బిక్షపతి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డ పైన హస్తం గుర్తుతో రంజిత్‌ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నా రు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి చేవెళ్ల అభివద్ధికి గతంలో కషి చేశారు. భవిష్యత్తులో కూడా ఆయన తోనే అభివద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్ర మంలో ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్‌ బీమ్‌ భరత్‌, పీసీసీ సభ్యులు షాబాద్‌ దర్శన్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love