ఫిబ్రవరి 16న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

నవతెలంగాణ –  మద్నూర్ 
వచ్చె నెల ఫిబ్రవరి 16 న జరిగే అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన ఏజెన్సి కార్మికుల దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ కామారెడ్డి జిల్లా కన్వీనర్ కె. చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం మద్నూర్ మండలము మెనుర్ గ్రామంలో డోoగ్లి, మద్నూర్ మండలాలకు చెందిన అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన ఏజెన్సి కార్మికులకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్ర శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా   ఆయన మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను నిరసనగా చేపట్టే సమ్మెతో పాటు గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమం లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అర్. అనసూయ,సచిత, సుజాత, ప్రేమల, శారద, సరస్వతి, సుమన్ బాయి,శాంతి, సాయిలు,లక్ష్మి,రుప్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love