సివిల్ ర్యాంకర్ కంఠం మహేష్ కుమార్ని ఘనంగా సన్మానించిన టిఎన్జీవోలు

నవతెలంగాణ-కంటేశ్వర్ : ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ , అధ్యక్షతన సోమవారం నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం (IDOC) నందు నిజామాబాద్ జిల్లా సివిల్ ర్యాంకర్ శ్రీ, కంఠం మహేష్ కుమార్ ని మరియు వారి కుటుంబ సభ్యులను టీఎన్జీవోస్ పక్షాన ఘనంగా సన్మానించి, అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , టీఎన్జీవో మాజీ జిల్లా కార్యదర్శి,అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంగం అమృత్ కుమార్ , సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి , సలహాదారులు ఆకుల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love