నాలుగో విడత అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్

నవతెలంగాణ – అమరావతి
నాలుగో విడత అమ్మ ఒడి నిధులు విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. కాసేపటి క్రితమే కురుపాం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. నాలుగో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగో విడత అమ్మ ఒడి నిధులు విడుదల చేశారు. అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067.28 కోట్ల లబ్ధి చేకూర్చారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇరవై ఆరువేల కోట్లు ఇప్పటి వరకు ఈ పథకానికి ఇవ్వడం జరిగిందని.. ఇదంతా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా అందిందని వివరించారు. పిల్లల భవిష్యత్తు కోసం.. బడికి పిల్లలను పంపించేందుకు ఆ తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకం ఇది. దేశంలో మరెక్కడా జరగటం లేదు… ఒక్క మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. నాలుగేళ్లలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని వివరించారు.

Spread the love