సివిల్స్‌ 3వ ర్యాంకర్‌ ఉమకు శుభాకాంక్షలు

– ఎంపీ వద్దిరాజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించిన ఉమాభారతికి మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మున్నూరుకాపు బిడ్డ కావడం ఎంతో సంతోషదాయకమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె ప్రజలకు అత్యుత్తమ సేవలందిస్తూ ప్రభుత్వానికి, తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పుట్టినగడ్డకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.ఉమను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులు, యువతకు సూచించారు. ఉమ ఇంత గొప్ప విజయాన్ని అందుకునేందుకు స్ఫూర్తినిచ్చిన, ప్రోత్సహించిన ఆమె తండ్రి, నారాయణపేట ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు, తల్లి శ్రీదేవి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఆయన అభినందనలు తెలిపారు.

Spread the love