కార్మికుల సంక్షేమానికి కృషి : ఎస్పీఎం జీఎం ఎంఎస్‌ గిరి

నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
సిర్పూరు పేపర్‌ మిల్లు కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేస్తోందని మిల్లు జనరల్‌ మేనేజర్‌ ఎంఎస్‌ గిరి అన్నారు. బుధవారం స్థానిక మిల్లు హెల్త్‌ సెంటర్‌లో కార్మికులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లు యాజమాన్యం నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు, సిబ్బందిని యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకటేష్‌ బియ్యాల, మిల్లు చీఫ్‌ మేనేజర్‌ రమేష్‌రావు, మేనేజర్‌ శశికాంత్‌ బోడే, ప్రతినిధులు తుమ్మ రమేష్‌, ఉదరుకుమార్‌, ఆసుపత్రి సిబ్బంది జయసింహ, సిస్టర్‌ సుజా పాల్గొన్నారు.

Spread the love