భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న జైలు..ఖైదీలు పరార్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : నైజీరియాలోని ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. అదను చూసుకుని 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారని అధికారులు వెల్లడించారు. పారిపోయిన వారికోసం గాలిస్తున్నామని, ఇప్పటివరకు 10 మందిని పట్టుకోగలిగామని చెప్పారు. మిగిలినవారి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని తెలిపారు.

Spread the love