– ముఖ్యఅతిథిగా స్పీకర పోచారం
నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మంఫలం ముందస్తు పంటల సాగు పై ఈ నెల 27 వ తేదీన నియోజకవర్గ స్థాయి రైతులకు అవగాహన సదస్సుకు రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని నసురుల్లాబాద్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ తెలిపారు. గురువారం నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లీ సాయిబాబా కళ్యాణ మండపంను ఆర్డీఓ రాజగౌడ్ , వ్యవసాయ శాఖ డివిజన్ అధికారి విజయ్ కుమార్, స్పీకర్ వ్యక్తి గత సహాయకుల తో కలసి స్థలం పరిశీలించారు. ఈ సందర్భంగా పెర్క శ్రీనివాస్ మాట్లాడుతూ నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లీ సాయి బాబా మందిరం వెనుక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ముందస్తు పంటల సాగుతో రైతులు ప్రకృతి వైపరీత్యాలతో తప్పించుకోవచ్చుకునే విదంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగహన కల్పిస్తారని తెలిపారు.వీరి వెంట ఎంపిపి పాల్త్య విఠల్, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మజీద్, జిల్లా రైతు నాయకులు అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కిష్టారెడ్డి, సర్పంచ్ ఫోరం కన్వీనర్ రాము, తదితరులు ఉన్నారు.