సీపీఐ(ఎం) సభ్యురాలు అబద్దం మృతి…

– నివాళులు అర్పించిన మండల కార్యదర్శి చిరంజీవి….

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని పండు వారి గూడెం సీపీఐ(ఎం) శాఖ సభ్యురాలు మడకం అబద్దం (45) అనారోగ్యంతో శనివారం తన గృహంలో మృత్తి చెందారు. ఆమె గత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతుంది. సభ్యురాలు మృతి సమాచారం తెలుసుకున్న మండల కార్యదర్శి చిరంజీవి హుటాహుటిన పండు వారి గూడెం చేరుకుని అబద్దం భౌతిక కాయం పై అరుణ పతాకం ఉంచి నివాళులు అర్పించారు.జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మండల కమిటీ సభ్యులు మడకం గోవిందు, స్థానిక సభ్యులు పాల్గొన్నారు.
Spread the love