చెరువులో మృతదేహం

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక చెరువులో ఒ యువకుడు శవమై కనిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అశ్వారావుపేట లోని నందమూరి నగర్ కు చెందిన ఎస్కే అమీర్ (21) గత కొద్ది నెలలుగా మనోవ్యాధితో పడుతుండగా గుర్తించిన కుటుంబీకులు విజయవాడ ఆస్పత్రి కు తరలించి వైద్యం చేయిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి టైర్ల దుకాణానికి వెళ్లి వస్తానని చెప్పి రాత్రి ఐనా తిరిగి రాలేదు. ఆలస్యంగా గుర్తించి ఆచూకీ కోసం కుటుంబీకులు గాలిస్తున్న క్రమంలోనే స్థానిక దొంతికుంట చెరువులో మంగళవారం ఉదయం మృత దేహమై తేలాడు.సమాచారం అందుకున్న స్థానిక సీఐ బొమ్మెర బాలకృష్ణ, ఎస్సై బీ.రాజేశ్ కుమార్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటకు తీయించారు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని పరిశీలించి అమీర్ గా గుర్తించారు. మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్ లో మార్చురీకి తరలించారు.దీనిపై మృతుని తండ్రి ఇబ్రహీం చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Spread the love