తొమ్మిది నెలల గర్భవతి అదృశ్యం..

నవతెలంగాణ-నల్లబెల్లి: తొమ్మిది నెలల గర్భవతి అదృశ్యమైన సంఘటన మండలంలోని లెంకాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లెంకాలపల్లి గ్రామానికి చెందిన నానబోయిన పావని అనే తొమ్మిది నెలల గర్భవతి ఆసుపత్రి చెకప్‌కు వెళ్తానని భర్త కిరణ్‌ను అడుగగా బుధవారం కిరణ్ నల్లబెల్లి బస్టాండ్‌లో దించి వచ్చినట్లు తెలిపాడు. రాత్రి అయినా ఏడాదిన్నర కూతురుతో వెళ్లిన పావని తిరిగి ఇంటికి రాక పోవడంతో గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేష్ తెలిపారు.

Spread the love