ప్రతి ఒక్క కూలి 272 రూపాయలు పడేలా పనిచేయాలి

నవతెలంగాణ – రాజంపేట్: ప్రతి ఒక్క కూలికి సుమారుగా 272 రూపాయల దినసరి వేతనం పడేలా పనిచేయాలని ఎంపీడీవో బాలకిషన్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం కింద లేబర్ శాతం పెంచుటకు మరియు రూపాయల 272 కూలీలకు అందే విధంగా చేయుటకు తగు సూచనలు చేశారు ఇట్టి సమావేశంలో ఏపీవో భాస్కర్, టి.ఏ రాజుచారి, అందరు ఫీల్డ్ అసిస్టెంట్లు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love