ఏడో రోజు ఎనిమిది నామినేషన్లు..

– 15 మంది 18 సెట్ లు దాఖలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఎన్నికల ప్రక్రియలో భాగం అయిన నామినేషన్లు స్వీకరణ గడువు దగ్గర పడటంతో ఏడో రోజు గురువారం ఎనిమిది నామినేషన్ లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. అర్జున్ రావు పిట్టల సీపీఐ(ఎం), మండలం ప్రసాద్(బీఎస్పీ), అరియం ప్రశాంత్(స్వతంత్ర), మెచ్చా నాగేశ్వరరావు(బీఆర్ఎస్) మూడో సెట్, మూడ్ రవీందర్ (ఇండియా ప్రజా కాంగ్రెస్ పార్టీ), ఊకే రవి(స్వతంత్ర) రెండో సెట్, సున్నం నాగమణి(స్వతంత్ర), గొగ్గెల ఆదినారాయణ సీపీఐ(ఎం) డమ్మి అభ్యర్ధిగా నామినేషన్లు దాఖలు చేసారు. గురువారం నాటికి 15 మంది అభ్యర్ధులు 18 నామినేషన్లు దాఖలు చేసారు.

Spread the love