ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ఆంజనేయులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కచ్చితంగా మే 13న లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు. ఈనెల 25 లోపు ఓటు హక్కు కోసం బిఎల్ఓ ల దగ్గర లేదా మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ కార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉందని, దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఎంఈఓ ఆంధ్రయ్య, వేల్పూర్ డిప్యూటీ తహసిల్దార్ సరిత, ఏపీఎం కుంట గంగారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, బూత్ లెవల్ అధికారులు, సెర్ప్ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love