ఎస్‌ఎంసీ కమిటీల గడువు పొడిగింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ)ల గడువు జూన్‌ ఒకటి నుంచి నవంబర్‌ 30 వరకు పొడిగించారు. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
స్థాన మార్పు కోసం అభ్యర్థనలు
సమగ్ర శిక్షా పరిధిలో మండల విద్యావనరుల కేంద్రంలో తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తూ ప్రస్తుత స్థానం నుంచి ఇతర స్థానాలకు మార్పు కోరుకునే వారు తమ అభ్యర్థనలను పెట్టుకోవాలని పాఠశాల విద్యా సంచాలకులు ఒక ప్రకటనలో కోరారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్లు, ఐఇఆర్పీలతో పాటు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పని చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిస్టమ్‌ అనలిస్ట్స్‌, అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్లు తమ అభ్యర్థనలను ఈ నెల 23 నుంచి 25 వరకు ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌ పెట్టుకోవచ్చు.

Spread the love