ఐదు తరాలు ఆవిష్కరణ

ఈ నెల 14వ తేదీ ఉదయం 10:30గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోయబ్‌ హాల్‌లో గులాబీల మల్లారెడ్డి కథల పుస్తకం ‘ఐదు తరాలు’ ఆవిష్కరణ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో ఏనుగు నరసింహారెడ్డి పుస్తకావిష్కరణ చేయనున్నారు. బొజ్జ బిక్షమయ్య, రాపోలు సుదర్శన్‌, ప్రమోద్‌, గుడిపాటి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Spread the love