వైయస్సార్‌ ట్రస్టు సేవలు అభినందనీయం అ మాజీ ఎంపీ మిడియం బాబురావు

నవతెలంగాణ-దుమ్ముగూడెం
అమరజీవి యలమంచి సీతారామయ్య పేరిట చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ఎంపీ సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబురావు అభినందించారు. దుమ్ముగూడెం గ్రామానికి చెందిన మురికిపూడి వీర్రాజు అనే అగ్ని భాదిత కుటుంబానికి యలమంచి సీతారామయ్య చారిటబుల్‌ ట్రస్టు ద్వారా అందజేసిన నిత్యావసరాలు, రూ.10 వేల విలువ చేసే వంట సామాగ్రితో పాటు రూ.3 వేల నగదును బాదిత కుటుంబానికి ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి యలమంచి సీతారామయ్య పేరిట వారు కుటుంబ సభ్యులు చారిటబుల్‌ ట్రస్లు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారికి అపన్నహస్తం అందించడం అభినందనీయం అన్నారు. కరోనా, గోదావరి వరదల సమయంలో శక్తికి మించి సేవలు అందించిన యలమంచి శ్రీనివాసరావు, వంశీకృష్ణతో పాటు బృందం సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్య క్రమంలో సిపిఐ(ఎం) పార్టీ భద్రాచలం డివిజన్‌ కో కన్వీనర్‌ కారం పుల్లయ్య, దుమ్ముగూడెం ఎంపిటిసి సభ్యురాలు కొర్సా చిలకమ్మ, శాఖా కార్యదర్శి బర్రి నర్సింహారావు, వార్డు సభ్యులు బైరెడ్డి సతీష్‌, సారిపల్లి త్రినాధ్‌, కర్రి రవీందర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Spread the love