నవతెలంగాణ-అశ్వారావుపేట
జిహ్వకో రుచి-పుర్రెకో బుద్ది అనే నానుడిని కొందరు రుజువు చేస్తున్నారు. సాధారణంగా పుట్టిన రోజును ఇంట్లో జరుపుకుంటారు. కానీ ఓ చిన్నారి కోరిక మేరకు తాత ఆమె పుట్టిన రోజును క్రీడాకారులు మధ్య జరిపారు. బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంత నాయకులు, టెలికాం అడ్వైజరీ మెంబర్ బిర్రం వెంకటేశ్వరరావు (తనయుని కుమార్తె) మనవరాలు హేమ శ్రీ పుట్టిన రోజును శుక్రవారం క్రీడాకారుల మధ్య నిర్వహించారు. మండలంలోని గాండ్లగూడెంలో గురువారం ప్రారంభం అయిన మెచ్చా క్రికెట్ లీగ్ శుక్రవారం కొనసాగింది. ఈ క్రమంలో వినాయకపురంకు చెందిన వెంకటేశ్వరరావు మనవరాలు హేమ శ్రీతో సహా గాండ్లగూడెం వెళ్ళి క్రీడాకారులు మధ్య పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, ప్రేక్షకులకు 100 మందికి శీతల పానీయంతో పాటు మామిడి పండ్లు అందజేసారు. ఈ కార్యక్రమంలో గాండ్లగూడెం బీఆర్ఎస్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మాలోతు చంద్రకళ, ఆలీ బాబు, నవీన్ నాయక్, వంశీ, చందు, శ్రీహరి, రామకృష్ణ, శ్రీకాంత్, రవి, రాంజీ, లాలు, ప్రసాద్, క్రికెట్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.